నాలుగేళ్ళలో... రూ. 346 కోట్లు... అదనపు సేవల కింద ఎస్‌బీఐకి వచ్చిన మొత్తం...

ABN , First Publish Date - 2021-12-15T20:42:20+05:30 IST

ప్రభుత్వరంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి మొన్నటి అక్టోబరు వరకు బేసిక్ సేవింగ్స్, జన్ ధన్ అకౌంట్స్ తదితర ఖాతాలకు సంబంధించి... అదనపు ఛార్జీల ద్వారా రూ. 346 కోట్లను ఆర్జించింది.

నాలుగేళ్ళలో... రూ. 346 కోట్లు... అదనపు సేవల కింద ఎస్‌బీఐకి వచ్చిన మొత్తం...

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి మొన్నటి అక్టోబరు వరకు బేసిక్ సేవింగ్స్, జన్ ధన్ అకౌంట్స్ తదితర ఖాతాలకు సంబంధించి...  అదనపు ఛార్జీల ద్వారా రూ. 346 కోట్లను ఆర్జించింది. ఖాతాదారులకు ఉచితసేవలనందించడంతో పాటు పై ఈ సేవలకు గాను... ఈ మొత్తం సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. ఎస్‌బీఐ సమాచారం మేరకు 2017-18 నుండి ఈ ఏడాది అక్టోబరు వరకు ఖాతాదారులు కోరిన కనీస ఉచిత సేవలకు మించి అదనపు సేవలనందించినందుకు గాను రూ. 345.84 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


నిరుడు  ఆగస్టు 30 నాటి సీబీడీటీ మార్గదర్శకాల ప్రకారం రూపే డెబిట్ కార్డు, యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్ తదితర ఎలక్ట్రానిక్ మోడ్స్‌ను ఉపయోగించి నిర్వహించిన లావాదేవీలపై నిరుడు జనవరి ఒకటిన, లేదా, ఆ తర్వాత వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంకులకు కేంద్రం సూచిం,చిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ మార్గదర్శకాల నేపధ్యంలో...  ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద తెరచిన ఖాతాలు సహా వివిధ బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-15T20:42:20+05:30 IST