నాస్కామ్ కొత్త చైర్పర్సన్ రేఖా మీనన్
ABN , First Publish Date - 2021-04-23T06:36:19+05:30 IST
యాక్సెంచర్ ఇండియా సీనియర్ ఎండీ రేఖా మీనన్.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ‘నాస్కామ్’ కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు...
న్యూఢిల్లీ: యాక్సెంచర్ ఇండియా సీనియర్ ఎండీ రేఖా మీనన్.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ‘నాస్కామ్’ కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం నాస్కామ్ వైస్ చైర్పర్సన్గా ఉన్న మీనన్.. ప్రవీణ్ రావు స్థానంలో చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తారు. నాస్కామ్ 30 ఏళ్ల చరిత్రలో ఒక మహిళను చైర్పర్సన్గా నియమించడం ఇదే మొదటిసారి. కాగా టీసీఎస్కు చెందిన కృష్ణన్ రామానుజం.. వైస్ చైర్మన్గా నియమితులయ్యారు.