ఆర్బీఐ మరో ‘సారీ’!
ABN , First Publish Date - 2021-02-01T05:58:35+05:30 IST
ఆర్బీఐ వచ్చే నెల 5వ తేదీన తదుపరి ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. కేంద్ర బడ్జెట్ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే జరగబోతున్న మరో కీలక ఘట్టం ఇది.

కీలక రేట్లలో యథాతథ స్థితికే అవకాశం
ముంబై: ఆర్బీఐ వచ్చే నెల 5వ తేదీన తదుపరి ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. కేంద్ర బడ్జెట్ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే జరగబోతున్న మరో కీలక ఘట్టం ఇది. ఒకే వారంలో ఆర్థిక, ద్రవ్య విధానాలకు సంబంధించి రెండు కీలక సంఘటనలు జరగబోతుండడం అందరిలోనూ ఉత్సుకత రేపుతోంది. కాని రెపో రేట్లలో ఈ సారి కూడా ఎలాంటి మార్పులు లేకుండా యథాపూర్వ స్థితికే ఆర్బీఐ మొగ్గు చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే సద్దుబాటు ధోరణిని మాత్రం కొనసాగించవచ్చునంటున్నారు. దానికి తోడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ప్రకటించే 2021-22 బడ్జెట్ ఆధారంగా కూడా ఆర్బీఐ తన వైఖరిలో మార్పులు, చేర్పులు చేసుకునే ఆస్కారం ఉంది.