ఆయిల్ పీఎ్సయూల్లో 100% ఎఫ్డీఐకి ఓకే..
ABN , First Publish Date - 2021-07-23T05:44:34+05:30 IST
ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ప్రయత్నాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ఈక్విటీలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఏ)కి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ సంస్థల ఈక్విటీలో 49 శాతం ఎఫ్డీఐని మాత్రమే అనుమతిస్తున్నాయి. అయితే ఈ సడలింపు పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. బీపీసీఎల్ ఈక్విటీలో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా కొనేందుకు మూడు సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో రెండు విదేశీ పీఈ సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.