అంతర్జాతీయ పీస్ అంబాసడర్ ‘ఎస్వీఆర్’ దుబాయ్ పర్యటన
ABN , First Publish Date - 2021-12-26T23:14:05+05:30 IST
అంతర్జాతీయ పీస్ అంబాసడర్గా నియమితుడై, బాధ్యతలు స్వీకరించిన తెలుగోడు... ఎస్వీఆర్(సరికొండ వినయ్ రెడ్డి) దుబాయ్లో పర్యటించనున్నారు.

హైదరాబాద్ : అంతర్జాతీయ పీస్ అంబాసడర్గా నియమితుడై, బాధ్యతలు స్వీకరించిన తెలుగోడు... ఎస్వీఆర్(సరికొండ వినయ్ రెడ్డి) దుబాయ్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవానికి(అంతర్జాతీయ పీస్ అంబాసడర్) ఎంపికైన మొట్టమొదటి ప్రముఖుడు ఎస్వీఆర్ కావడం విశేషం. ఫ్లోరిడా(అమెరికా)లోని వరల్డ్ హ్యుమానిటీ కమిషన్(భారత్) ఈ గౌరవాన్ని ప్రకటించిన విషఫయం తెలిసిందే. దుబాయ్లో జరగనున్న ఓ అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలకు సంబంధించి... ఎస్వీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు కమిషన్ ఈ సందర్భంగా పేర్కొంది. నిజామాబాద్ జిల్లా బిక్కనూరుకు చెందిన ఎస్వీఆర్... దేశవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల తరపునే కాకుండా, ఎస్వీఆర్... వ్యక్తిగతంగా కూడా... సామాజిక సేవలనందిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా... ఇతరత్రా ఎటువంటి విరాళాలనూ స్వీకరించకుండా, సొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమాలను ఎస్వీఆర్ నిర్వహిస్తూండడం గమనార్హం.
కాగా... తమతో కలిసిపనిచేయాల్సిందిగా ఎస్వీఆర్ను పలు అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానిస్తుండడం విశేషం. కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకునిగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే క్రియాశీల బాధ్యతలను నిర్వర్విస్తోన్న ఎస్వీఆర్ను... ఇదే క్రమంలో... జాతీయస్థాయిలో ఓ ప్రముఖ సంస్థ కు సారధ్య బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. ఇక... దుబాయ్ పర్యటన అనంతరం... తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో తన సామాజిక కార్యక్రమాలను మరింత పెద్దాఎత్తున చేపట్టేందుకు ఎస్వీఆర్ సన్నాహాలు చేసుకుంటున్నారు.