‘హైబ్రిడ్ వర్కింగ్ మోడల్’ వూపే మొగ్గు

ABN , First Publish Date - 2021-08-04T19:23:39+05:30 IST

డిసెంబరు నాటికి తమ ఉద్యోగులందరినీ కార్యాలయాలకు రప్పించాలని 33 శాతం కంపెనీలు, 2022 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు భావిస్తున్నాయి.

‘హైబ్రిడ్ వర్కింగ్ మోడల్’ వూపే మొగ్గు

హైదరాబాద్ : డిసెంబరు నాటికి తమ ఉద్యోగులందరినీ కార్యాలయాలకు రప్పించాలని 33 శాతం కంపెనీలు, 2022 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పననిచేస్తుండగా, దాదాపు రెండు లక్షల మంది దూర ప్రాంతాల నుండి(వర్క్ ఫ్రం హోం) పని చేస్తున్నారు. కాగా... డెబ్బై శాతం సంస్థలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌కు మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. కరోనా వ్యాక్సీన్ రెండు డోసులు పూర్తయిన వారిని వారానికి మూడు రోజులు కార్యాలయాల్లోనే పనిచేయించాలని మరికొన్ని సంస్థలు భావిస్తున్నాయి. కాగా ఉద్యోలలో మాత్రం, ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో అధికభాగం వర్క్ ఫ్రం హోం వేపు మొగ్గుచూపనుతుండగా, దాదాపు 40 శాతం మంది మాత్రం కార్యాలయాలకే వచ్చి పనిచేయాలని భావిస్తుండడం గమనార్హం. మరో 20 శాతం మంది మాత్రం హైబ్రిడ్ విధానంపట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. 

Updated Date - 2021-08-04T19:23:39+05:30 IST