అమెజాన్-ఇన్ఫోసిస్ జాయింట్ వెంచర్ రద్దు
ABN , First Publish Date - 2021-08-10T22:51:26+05:30 IST
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తితో కలిసి అమెజాన్ సంస్థ భారత్లో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ రద్దయింది.
బెంగళూరు : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తితో కలిసి అమెజాన్ సంస్థ భారత్లో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ రద్దయింది. ‘ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో స్థాపితమైన ఈ జాయింట్ వెంచర్... వచ్చే ఏడాది(2022) మధ్యస్థం నుండి పని చేయడం నిలిచిపోతుందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్, అమెజాన్ సంస్థలు ఉమ్మడిగా ప్రకటించాయి. భారతదేశంలో ఆన్లైన్ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు అంచనా వేసిన సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బేనని భావిస్తున్నారు.
జాయింట్ వెంచర్...
జాయింట్ వెంచర్(జేవీ లో దాదాపు మూడు లక్షలమంది విక్రేతలు, వ్యవస్థాపకులకు ఆన్లైన్ అమ్మకాలకు అనుమతి ఉంది. డిజిటల్ చెల్లింపు సామర్థ్యాలున్న నాలుగు మిలియన్ల మంది వ్యాపారులకు అవకాశముంది. కాగా... తాజా పరిణామాల నేపధ్యంలో వీటికి తెరపడినట్లైంది.