59% పెరిగిన రెయిన్ ఇండస్ట్రీస్ లాభం
ABN , First Publish Date - 2021-10-31T09:38:59+05:30 IST
రెయిన్ ఇండస్ట్రీస్ సెప్టెంబరుతో త్రైమాసికంలో రూ.205 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రెయిన్ ఇండస్ట్రీస్ సెప్టెంబరుతో త్రైమాసికంలో రూ.205 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.129 కోట్లతో పోలిస్తే 59 శాతం పెరిగింది. ఆదాయం కూడా రూ.2,566 కోట్ల నుంచి రూ.3,849 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (50ు) మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది