వచ్చే ఏడాది వేతన వృద్ధి 9.3%
ABN , First Publish Date - 2021-10-21T07:59:09+05:30 IST
వచ్చే ఏడాది భారత కార్పొరేట్ రంగ ఉద్యోగుల వేతనాలు సరాసరిగా 9.3 శాతం మేర పెరగవచ్చని..

ఈ ఏడాదిలో 8 శాతం.. విల్లీస్ టవర్స్ వాట్సన్ అంచనా
ముంబై: వచ్చే ఏడాది భారత కార్పొరేట్ రంగ ఉద్యోగుల వేతనాలు సరాసరిగా 9.3 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ అడ్వైజరీ, బ్రోకింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ విల్లీస్ టవర్స్ వాట్సన్ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది సరాసరి వృద్ధి అంచనా 8 శాతం కంటే అధికమని అంటోంది. 2022 సగటు వేతన వృద్ధి అంచనా ఆసియా పసిఫిక్ దేశాల్లోకెల్లా అత్యధి కమని రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది మే-జూన్ కాలంలో ఆసియా పసిఫిక్లోని 13 మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన 1,405 కంపెనీల నుంచి ఆన్లైన్లో సేకరించిన వివరాల ద్వారా ఈ నివేదికను రూపొందించినట్లు విల్లీస్ టవర్స్ వాట్సన్ తెలిపింది. భారత్లోని 435 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఆదాయంపై 52.2 శాతం కంపెనీలు సానుకూల దృక్పథంతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వచ్చే 12 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు 30 శాతం కంపెనీలు వెల్లడించాయి.