పీఎం కిసాన్ యోజన... దరఖాస్తుల్లో తప్పులుంటే డబ్బు రాదు...

ABN , First Publish Date - 2021-05-03T23:41:23+05:30 IST

రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి’ పథకం డబ్బు రావడం లేదని వినవస్తోతంది.

పీఎం కిసాన్ యోజన... దరఖాస్తుల్లో తప్పులుంటే డబ్బు రాదు...

న్యూఢిల్లీ : రైతులకు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి’ పథకం డబ్బు రావడం లేదని వినవస్తోతంది. ఇందుకు ప్రధాన కారణం... దరఖాస్తుల్లో పొరపాట్లు జరుగుతుండడమేనని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు స్పెల్లింగ్ మిస్టెక్‌ చోటుచేసుకున్నా... నగదు రాదు. ఆధార్, అప్లికేషన్, బ్యాంక్ ఖాతా, రెవెన్యూ రికార్డులల్లో ఏవైనా లోపాలుంటే... రైతు రూ. 6 వేలను ఖర్చు చేయాల్సిందే.


ఆ లోపాన్ని సరిదిద్దే వరకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి’ డబ్బు రాదు. చాలా మంది ఆధార్ సంఖ్యను తగ్గించారని, బ్యాంక్ ఖాతా నంబరులో లోపాలున్నాయని సమాచారం. ఈ క్రమంలోనే... పథకానికి సంబంధించి ఆటోమేటిక్ సిస్టమ్ అప్‌డేట్ కావడం లేదన్నది రైతులు గుర్తుంచుకోవాలి. మొత్తంమీద ఈ క్రమంలోనే లక్షల సంఖ్యలో రైతుల దరఖాస్తులు ఇప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి.


పేరు తప్పుగు రాసినపక్షంలో ఆన్‌లైన్‌లో పరిష్కరించవచ్చు. మరేదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకునేందుకుగాను వ్యవసాయ శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు సమయంలో సరైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నింపేటప్పుడు ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇఇక దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606 లో సంప్రదించాలి.

Updated Date - 2021-05-03T23:41:23+05:30 IST