జీఓసీఎల్‌ లాభం రూ.27 కోట్లు

ABN , First Publish Date - 2021-06-30T07:04:33+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.27.48 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

జీఓసీఎల్‌ లాభం రూ.27 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.27.48 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం  ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస్తే 99 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయంలో మార్పులేదని, గత ఏడాది స్థాయిలోనే రూ.150 కోట్లు నమోదైందని  పేర్కొంది. మొత్తం ఏడాదికి రూ.557 కోట్ల ఆదాయంపై రూ.78.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వాటాదారులకు రూ.2 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.2 (100%) తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

Updated Date - 2021-06-30T07:04:33+05:30 IST