10 కొత్త ఏపీఐలపై దివీస్ కసరత్తు
ABN , First Publish Date - 2021-03-05T06:36:17+05:30 IST
జెనరిక్ యాకి ్టవ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ) విభాగం లో మరిన్ని మాలిక్యూల్స్ను అభివృద్ధి చేసి, తయారు చేయాలని దివీస్ లేబొరేటరీస్ యోచిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జెనరిక్ యాకి ్టవ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ) విభాగం లో మరిన్ని మాలిక్యూల్స్ను అభివృద్ధి చేసి, తయారు చేయాలని దివీస్ లేబొరేటరీస్ యోచిస్తోంది. ఈ ఏపీఐల తయారీకి అవసరమైన పెట్టుబడుల ప్రణాళికలను కూడా కంపెనీ సిద్ధం చేసింది. దాదాపు 10 కొత్త మాలిక్యూల్స్పై కంపెనీ కసరత్తు చేస్తోంది. కాగా కస్టమ్ సింథసిస్ (సీఎస్) విభాగంలో రూ.400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒక ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ విభాగంలో మరో రెండు ప్రాజెక్టులు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పూర్తి కాగలవని వెల్లడించింది.