గూగుల్ పే, పేటీఎంలతో... ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు... ఎలాగంటే...
ABN , First Publish Date - 2021-04-05T22:32:49+05:30 IST
డెవిట్ కార్డ్ లేదా? అయినా ఫర్వాలేదు. ఏటీఎం నుంచి బ్బు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకుగాను... ఫోన్లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ మొబైల్ వ్యాలెట్స్ ఉంటే చాలు
బెంగళూరు : డెవిట్ కార్డ్ లేదా? అయినా ఫర్వాలేదు. ఏటీఎం నుంచి బ్బు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకుగాను... ఫోన్లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ మొబైల్ వ్యాలెట్స్ ఉంటే చాలు. వాటి సాయంతో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ ఈ వివరాలను వెల్లడించింది.
యూపీఐ ఆధారిత యాప్లతో డబ్బు విత్డ్రా చేసుకునేలా కొత్త టెక్నాలజీని తీసుకువచ్చినట్లు ఎన్సీఆర్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇప్పటికే 1,500 లకు పైగా ఏటీఎంలలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టగా, దేశవ్యాప్తంగా మరిన్ని ఏటీఎంలలోనూ దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఇక యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా ఎలాగంటే...
ముందుగా మొబైల్లోని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ను ఓపెన్ చేయాలి. ఆ యాప్ మన బ్యాంక్ ఖాతాతో అనుసంధానితమై ఉండాలి. ఇక ఏటీఎంలో క్యూఆర్ క్యాష్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఏటీఎం తెరపై కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసిన తరువాత డిజిటల్ యూపీఐ పిన్కోడ్ను ఎంటర్ చేయాలి. ఓకే చేసిన తరువాత ఏటీఎం మెషీన్ నుంచి నగదు వస్తుంది.
అయితే, ప్రస్తుతానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా గరిష్ఠంగా రూ. 5 వేలు మాత్రమే విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. భవిష్యత్తులో ఈ మొత్తాన్ని పెంచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.