తిరోగమనం ముగిసినట్టే : బ్లూమ్బర్గ్
ABN , First Publish Date - 2021-02-26T09:56:50+05:30 IST
భారత ఆర్థిక వ్యవస్థలో తిరోగమన దశ ముగిసిపోయినట్టేనని, కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటులోకి తిరిగి ప్రవేశించే ఆస్కారం

భారత ఆర్థిక వ్యవస్థలో తిరోగమన దశ ముగిసిపోయినట్టేనని, కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటులోకి తిరిగి ప్రవేశించే ఆస్కారం ఉందని బ్లూమ్బర్గ్ తెలిపింది. బ్లూమ్బర్గ్ ట్రాక్ చేసిన ఎనిమిది కీలక ఆర్థిక సూచీల్లో రెండు పునరుజ్జీవ పథంలో పడినట్టు పేర్కొంది. దేశంలో సేవల రంగం కార్యకలాపాలు వేగం అందుకోవడంతో పాటు తయారీ రంగం కార్యకలాపాలు కూడా శక్తివంతం అవుతున్నట్టు తెలిపింది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో భార త ఆర్థిక వ్యవస్థ 13.7 శాతం వృద్ధిని సాధిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసింది.