వాటా విక్రయంతో రుణాన్ని తగ్గించుకోనున్న అదానీ...
ABN , First Publish Date - 2021-01-19T21:24:11+05:30 IST
విదేశీ దిగ్గజ కంపెనీలకు వాటాను విక్రయిస్తూ, మెగాడీల్స్తో జోరుమీదున్న బడా వ్యాపారవేత్తల జాబితాలో తాజాగా బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా చేరారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఎల్)లో మైనారిటీ వాటాను ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఈకి విక్రయించనుంది.
న్యూఢిల్లీ : విదేశీ దిగ్గజ కంపెనీలకు వాటాను విక్రయిస్తూ, మెగాడీల్స్తో జోరుమీదున్న బడా వ్యాపారవేత్తల జాబితాలో తాజాగా బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా చేరారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఎల్)లో మైనారిటీ వాటాను ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఈకి విక్రయించనుంది. ఈ డీల్ విలువ 2.5 బిలియన్ డాలర్ల (రూ. 18,200 కోట్లు). ఈ ఒప్పందం ద్వారా సమకూరిన నిధులతో అదానీ తన వ్యాపార రుణాన్ని తగ్గించుకోనుందని భావిస్తున్నారు.
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్లో 20 శాతం వాటాను కొనుగోలుకుగాను ఫ్రాన్స్కు చెందిన టోటల్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అలాగే సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న అదానీ గ్రీన్ బోర్డులోకి టోటల్ చేరనుంది. మొత్తం 2.35 గిగా వాట్స్ సోలార్ అసెట్ లో 50 శాతం వాటా అదానీ సొంతం. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉండగా, దీనిలో 20 శాతం వాటాను టోటల్కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది.
కాగా 1988 లో వస్తువుల వ్యాపారంతో ప్రారంభమైన అదానీ గ్రూప్... భారతదేశపు అగ్రశ్రేణి ప్రైవేటురంగ పోర్ట్ ఆపరేటర్ విద్యుత్తు జనరేటర్గా ఎదిగింది. రెండేళ్ళ క్రితం నుంచి విమానాశ్రయాలపై దృష్టి పెట్టిన అదానీ... తాజాగా డాటా స్టోరేజ్, ఆర్థిక సేవలు సహా ఇతర రంగాల్లోకి ప్రవేశి్స్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.483 ట్రిలియన్ డాలర్లు(20.25 బిలియన్ డాలర్లు).