వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-07-01T18:10:36+05:30 IST
వైఎస్సార్ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్గా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ..
అమరావతి: వైఎస్సార్ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్గా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ..రూ. 750 కోట్లతో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. 18-50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుందని అన్నారు. అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్సార్ బీమా పథకం అమలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు.