తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?

ABN , First Publish Date - 2021-06-17T23:42:16+05:30 IST

తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?

తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?

హైదరాబాద్/అమరావతి: గవర్నర్ కోటాలో వైసీపీ నేత తోట త్రిమూర్తులను సీఎం జగన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇందుకు గవర్నర్ హరిచందన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు కొనసాగుతోంది. ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు బెయిల్‌పై ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడాన్ని దళిత సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దళిత వ్యక్తికి శిరోముండనం చేసిన తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులును సీఎం జగన్ ఎంపిక చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


‘‘అసలు తోట త్రిమూర్తులుపై దళితులకున్న అభ్యంతరాలేంటి?. బెయిల్ రద్దు వాదన ఎందుకు గట్టిగా వినిపిస్తోంది?. ఎమ్మెల్సీ పదవి ఎందుకు వివాదంగా మారింది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక సంచిక నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-06-17T23:42:16+05:30 IST