రాజ్యసభ నుంచి వైసీపీ ఎంపీలు వాకౌట్‌

ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST

రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై చర్చ జరిగింది.

రాజ్యసభ నుంచి వైసీపీ ఎంపీలు వాకౌట్‌

ఢిల్లీ: రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై చర్చ జరిగింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ.. రాజ్యసభ నుంచి వైసీపీ ఎంపీలు వాకౌట్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోమని తెల్చిచెప్పారు. రాజ్యసభ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఒక్క కలం పోటుతో.. ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడం తగదని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో.. నవరత్న సంస్థగా స్టీల్‌ప్లాంట్‌ భాసిల్లుతోందన్నారు. ముందు ప్రభుత్వరంగ సంస్థలకు గనుల కేటాయింపు జరిగాకే.. మిగిలిన గనులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-03-21T05:30:00+05:30 IST