పేరు తెలియకుండానే నిరసన.. తప్పులో కాలేసిన వైసీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2021-10-21T01:23:03+05:30 IST
పి.గన్నవరంలో తప్పులే కాలేశాయి. తాము ఎవరిపై నిరసన చేస్తున్నామో కూడా తెలియకుండా ఆందోళన చేశాయి. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరుకు ...

రాజమండ్రి: పి.గన్నవరంలో తప్పులో కాలేశాయి. తాము ఎవరిపై నిరసన చేస్తున్నామో కూడా తెలియకుండా ఆందోళన చేశాయి. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరుకు బదులుగా ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి చేసిన బోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును ఫ్లెక్సీపై రాసుకొచ్చాశాయి. అది పట్టుకుని నిరసన తెలిపాయి. కనీసం టీడీపీ లీడర్ పేరు తెలియకుండానే ఆందోళన చేసిన వైసీపీ నాయకులను చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.