వైసీపీ నేత అక్రమ గ్రావెల్ దందా
ABN , First Publish Date - 2021-08-28T22:16:25+05:30 IST
జిల్లాలో నర్సీపట్నం మండలంలోని వేములపూడి గ్రామంలో వైసీపీ నేత
విశాఖ: జిల్లాలో నర్సీపట్నం మండలంలోని వేములపూడి గ్రామంలో వైసీపీ నేత అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్నారు. గ్రావెల్ తరలింపును టీడీపీ కార్యకర్తలు, రైతులు అడ్డుకున్నారు. దీంతో వారిపై వైసీపీ నేత అనుచరులు రాళ్లతో దాడి చేసారు. గ్రావెల్ తరలింపును అడ్డుకున్న వారిని లారీలతో ఎక్కించి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. నిందితుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిరసన తెలిపారు. అనంతరం నర్సీపట్నం తహసీల్దార్కు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.