యానాం-ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-07-25T22:39:43+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం పరిధిలోని యానాం-ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది.
యానాం: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గం పరిధిలోని యానాం-ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నీరు చేరడంతో అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో గౌతమి గోదావరి గుండా ప్రవహించి యానాం మీదుగా వరద నీరు సముద్రంలో కలుస్తుంది. దీంతో యానాం లోని పలు పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. యానాం పరిపాలనాదికారి కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ బీచ్కు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యానాంలోని నీట మునిగిన పల్లపు ప్రాంతాలను పరిపాలనాధికారి శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. మరో రెండు రోజుల్లో మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.