భర్త చేతిలో భార్య దారుణ హత్య
ABN , First Publish Date - 2021-03-26T16:25:57+05:30 IST
భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది.
ప్రకాశం: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన చీమకుర్తి మండలంలో జరిగింది. మండలంలోని మర్రిచెట్లపాలెంలో గురవయ్య, నారాయణమ్మ( 35) దంపతులు నివసిస్తున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు పెరిగాయి. తన భార్య నారాయణమ్మ( 35)ను భర్త గురవయ్య రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.