డబ్బు కట్టి ఇరుక్కుపోయాం
ABN , First Publish Date - 2021-02-05T08:51:21+05:30 IST
ప్రభుత్వం ఒక్కో వాహనాన్ని రూ.5.8 లక్షలకు కొనుగోలు చేసింది. అందులో 10శాతం అంటే రూ.58 వేలు వాహనదారుడు చెల్లించారు.
![డబ్బు కట్టి ఇరుక్కుపోయాం](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020503195372/02052021032111n57.jpg)
ప్రభుత్వం ఒక్కో వాహనాన్ని రూ.5.8 లక్షలకు కొనుగోలు చేసింది. అందులో 10శాతం అంటే రూ.58 వేలు వాహనదారుడు చెల్లించారు. నాలుగేళ్ల తర్వాత వాహనం సొంతమవుతుందని చెప్పారు. ఇప్పుడు... పని వదిలేసి పోతే రూ.58 వేలు నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వమే ఏదో పరిష్కారం చూపించాలని... రూ.13 వేల కోసం బండ చాకిరీ చేయలేమని మాత్రం చాలామంది ఆపరేటర్లు తేల్చిచెబుతున్నారు. వీరిపై చర్యలు తీసుకుంటే పంపిణీయే ఆగిపోతుందనే ఆందోళనతో... అధికారులు ప్రస్తుతానికి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.