దుర్గగుడికి వైసీపీ రంగుల విద్యుద్దీపాలా?
ABN , First Publish Date - 2021-10-07T09:35:17+05:30 IST
దుర్గగుడిని వైసీపీ రంగులున్న విద్యుద్దీపాలతో అలంకరించడం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కె.శివశర్మ విమర్శించారు.
![దుర్గగుడికి వైసీపీ రంగుల విద్యుద్దీపాలా?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు శివశర్మ
విజయవాడ, అక్టోబరు 6: దుర్గగుడిని వైసీపీ రంగులున్న విద్యుద్దీపాలతో అలంకరించడం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కె.శివశర్మ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెలంపల్లికి పిచ్చి ముదరడంతో వింత పోకడలకు పోతున్నారని చెప్పారు.