AP: విసన్నపేటలో టీడీపీ నేతల నిరసన ర్యాలీ...అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-11-20T17:13:55+05:30 IST
అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విసన్నపేటలో టీడీపీ మండల పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.
విజయవాడ: అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విసన్నపేటలో టీడీపీ మండల పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు టీడీపీ నేతల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది.