Indrakeeladri: సరస్వతి దేవి రూపంలో అమ్మవారు...పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-10-12T12:44:47+05:30 IST
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తులు పోటెత్తారు. జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తులు పోటెత్తారు. జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి పెరిగింది. సరస్వతి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో వినాయకుడి గుడి వద్ద నుంచి కొండపై భాగం వరకు పెద్ద క్యూలైన్లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. రెండు గంటలుగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో వేచివున్నారు. దర్శనానికి సుమారుగా ఇంకా గంటకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.