విశాఖ ఎయిర్పోర్టును భోగాపురానికి తరలిస్తాం: విజయసాయి
ABN , First Publish Date - 2021-09-05T19:54:49+05:30 IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలిస్తామని అన్నారు. విశాఖ ఎయిర్పోర్టును రక్షణ వర్గాలకు అప్పగిస్తామన్నారు. భోగాపురం రహదారి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. విశాఖలో మురికివాడలను అభివృద్ధి చేసి పేదలకు పట్టాలు ఇస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.