విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారిగా విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-12-15T08:56:35+05:30 IST
విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారిగా విజయలక్ష్మి

విజయవాడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారిగా జి.విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమె సోమవారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఈమె విద్యుత్ భద్రతా సంచాలకురాలిగా పనిచేస్తున్నారు. విజయలక్ష్మి విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారిగా నియమితురాలైన తొలి మహిళ కావడం విశేషం.