విద్యాదీవెన తొలివిడత జమ నేడు

ABN , First Publish Date - 2021-04-19T09:31:16+05:30 IST

ఈ విద్యా సంవత్సరానికి గానూ విద్యాదీవెన తొలి విడత సొమ్మును ప్రభుత్వం సోమవారం తల్లుల ఖాతాల్లో జమచేయనుంది.

విద్యాదీవెన తొలివిడత జమ నేడు

10.88 లక్షల తల్లుల ఖాతాల్లో 671 కోట్లు


అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరానికి గానూ విద్యాదీవెన తొలి విడత సొమ్మును ప్రభుత్వం సోమవారం తల్లుల ఖాతాల్లో జమచేయనుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలివిడత విద్యాదీవెనలో భాగంగా 2020-21 విద్యాసంవత్సరానికి 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 671.45 కోట్లను ప్రభుత్వం జమచేయనుంది. ఇకనుంచి ఏ త్రైమాసానికి ఆ త్రైమాసికంలోనే విద్యాదీవెన సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-04-19T09:31:16+05:30 IST