కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతతో రాష్ట్రం ఎడారి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-06-22T08:34:34+05:30 IST

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎడారిగా మారుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతతో రాష్ట్రం ఎడారి: తులసిరెడ్డి

వేంపల్లె, జూన్‌ 21: కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎడారిగా మారుతుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చే శారు. రోమ్‌ నగరం తగలబడి పోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయిస్తూ కూ ర్చున్నట్టు.. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల వైఖరి ఉందన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో 84, 85, 86, 87 సెక్షన్ల ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై పూర్తి హక్కు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. చట్టంలోని 87 సెక్షన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలన్నారు. ఏడేళ్లైనా ఆ పని చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ఉండిపోవడం శోచనీయమన్నారు. 

Updated Date - 2021-06-22T08:34:34+05:30 IST