48 గంటల్లో అల్పపీడనం
ABN , First Publish Date - 2021-11-23T09:21:30+05:30 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ..
![48 గంటల్లో అల్పపీడనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నేడు, రేపు వర్షాలు
అమరావతి/విశాఖపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. తర్వాత అది శ్రీలంక, దక్షిణ తమిళనాడు ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.