మిగులు పొగాకు కొనుగోలుకు కేంద్రం అనుమతి
ABN , First Publish Date - 2021-10-26T08:21:37+05:30 IST
ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో 2020-21 సీజన్లో పండించిన పొగాకు మిగులు కొనుగోలుకు కేంద్ర
న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో 2020-21 సీజన్లో పండించిన పొగాకు మిగులు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, రిజిస్టర్డ్ రైతులు ఒక కిలో పొగాకుకు ఒక్క రూపాయి, మొత్తం విక్రయంలో ఐదు శాతం పొగాకు నిధికి జమ చేయాలన్న షరతు విధించింది. అన్రిజిస్టర్డ్ రైతులు కిలో పొగాకుకు రూ. 2, మొత్తం విక్రయంలో 10 శాతం మొత్తం పొగాకు నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది.