తిరుపతి కాటన్ మిల్లును తెరిచేది లేదు: కేంద్రం
ABN , First Publish Date - 2021-07-23T08:34:21+05:30 IST
తిరుపతి కాటన్ మిల్లును తెరిచేది లేదు: కేంద్రం
లాక్డౌన్ కారణంగా మూత పడిన తిరుపతి కాటన్ మిల్లును భవిష్యత్లోనూ పునఃప్రారంభించబోమని కేంద్ర జౌళిశాఖ మంత్రి దర్శన జార్ధోష్ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటివరకు రూ.2.20కోట్ల విలువ అమ్మకంకాని నూలు 1834బ్యాగులు మిల్లులో ఉన్నట్లు తెలిపారు.