తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-19T13:25:54+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 36,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 36,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 14,168 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి విహరించనున్నారు.

Updated Date - 2021-12-19T13:25:54+05:30 IST