తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-02-05T14:05:47+05:30 IST
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం స్వామివారిని 46,928 మంది భక్తులు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం స్వామివారిని 46,928 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.15 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు, 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. అలాగే అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.