తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2021-08-04T12:54:58+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 20,421 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 20,421 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 1.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 9,528 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.