నేడు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

ABN , First Publish Date - 2021-08-20T12:02:15+05:30 IST

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం చేస్తారు...

నేడు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. అమ్మవారి మూలవర్లకు, ఉత్సవర్లకు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. అనంతరం ఉదయం 10నుంచి 12గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారంలో వర్చువల్‌ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విక్రయించింది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా పోస్టల్‌ ద్వారా ఆయా గృహస్తులకు పంపనున్నారు. 

Updated Date - 2021-08-20T12:02:15+05:30 IST