హైకోర్టు తీర్పుతో వారికి ఓటు హక్కు
ABN , First Publish Date - 2021-02-05T08:10:43+05:30 IST
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామంలోని 239 పోలింగ్ బూత్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
![హైకోర్టు తీర్పుతో వారికి ఓటు హక్కు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020502282888/02052021024009n78.jpg)
చిలకలూరిపేట, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామంలోని 239 పోలింగ్ బూత్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం తీర్పు ఇచ్చారు. పాత జాబితా ప్రకారమే ముందుకు సాగాలని తీర్పు ఇవ్వడంతో ఈ బూత్ పరిధిలోని 61మందికి ఓటు హక్కు లభించింది.