ఈ సమావేశాలు చారిత్రకమైనవి: శ్రీకాంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-11-27T00:21:45+05:30 IST
ఈ సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చారిత్రకమైనవని ప్రభుత్వ
అమరావతి: ఈ సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చారిత్రకమైనవని ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీల సూచనతో ఏడు రోజులు అసెంబ్లీ నిర్వహించామన్నారు. సభలో ఏమీ జరగకపోయినా కౌరవసభ అని టీడీపీ ఎమ్మెల్యేలే బయటకు వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లు జరిగిన సభనే కౌరవసభగా ఆయన అభివర్ణించారు. అన్నివర్గాల సంక్షేమం, విద్యారంగంతో పాటు అన్ని అంశాలపై చర్చించాన్నారు. సమావేశాలకు టీడీపీ హాజరు కాకుండా దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు.