‘కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గం’
ABN , First Publish Date - 2021-10-16T20:46:14+05:30 IST
అధికార యంత్రాగాన్నిజగన్ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ అన్నారు. జబీన్కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.
అమరావతి: అధికార యంత్రాగాన్నిజగన్ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ నసీర్ అన్నారు. జబీన్కు బీసీ-ఇ కులదృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ముస్లింలకు రాజకీయ సమాధి కట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడితో ముస్లిం మహిళలకు బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు. 2012లో ఇచ్చిన జీవో నంబర్ 23 ద్వారా షేక్ ఇంటిపేరు కలిగిన వారిని బీసీ-ఇ సర్టిఫికేట్ ఇవ్వాలనే నిబందన వుందన్నారు. రాజకీయాల కోసం గొంతుకోసే కార్యాక్రమాన్ని కలెక్టర్ చేపట్టారని చెప్పారు. ముస్లింల జోలికి రావద్దని హెచ్చరించారు.