మోసపు వాగ్దానాలతో జగన్ కాలక్షేపం: జవహర్
ABN , First Publish Date - 2021-06-13T01:21:05+05:30 IST
మోసపు వాగ్దానాలతో జగన్ కాలక్షేపం: జవహర్
అమరావతి: జగన్ పాలనలో తుగ్లక్ను, పన్నుల వసూళ్లో కత్బుద్దీన్ ఐబక్ను అనుసరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. నీటిపన్ను, ఆస్తిపన్ను, విలువ ఆధారిత ఆస్తిపన్ను, మిగిలింది జుట్టు పన్ను (జిజియా)కు సిద్ధపడాలన్నారు. బెయిల్ రద్దు చేయించుకోవటంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై లేదన్నారు. అమ్మకాలు, తాకట్టులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపు వాగ్దానాలతో జగన్ కాలక్షేపం.. అదే రాష్ట్రానికి శాపమన్నారు.