తాలిబన్లను మించిపోతున్న ‘వైకాపాబన్లు’: లోకేశ్
ABN , First Publish Date - 2021-08-25T09:10:30+05:30 IST
అరాచకాలు, నిరంకుశ వైఖరిలో అధికార వైసీపీ నేతలు అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్లను మించిపోయి, ‘వైకాపాబన్లు’గా

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అరాచకాలు, నిరంకుశ వైఖరిలో అధికార వైసీపీ నేతలు అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్లను మించిపోయి, ‘వైకాపాబన్లు’గా తయారయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ తన తాడేపల్లి రాజప్రాసాదం పక్కన ఎవ్వరూ ఉండకూడదన్న అభిప్రాయంతో వందలాది నిరుపేదల ఇళ్లను కూల్చివేయించడం, తాజాగా భద్రత పేరిట అక్కడి భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఇందుకు నిదర్శనాలని అభివర్ణించారు.