రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి: గద్దె రామ్మోహన్

ABN , First Publish Date - 2021-08-17T02:54:00+05:30 IST

హత్యకు గురైన దళిత కుటుంబానికి చెందిన రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు.

రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి: గద్దె రామ్మోహన్

అమరావతి: హత్యకు గురైన దళిత కుటుంబానికి చెందిన రమ్య కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు డిమాండ్ చేశారు. విజయవాడ దళిత యువతి హత్యకు నిరసనగా సోమవారం రామ్మోహన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బీటెక్ విద్యార్థి రమ్య హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలన్నారు. దళిత ద్రోహి జగన్మోహన్‌రెడ్డి అని అన్నారు. దళిత కుటుంబానికి చెందిన విద్యార్థినిని అత్యంత ఘోరంగా హత్యచేశారన్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులకు అవినీతి మీద ద్వాస తప్ప ప్రజలపై లేదన్నారు. ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయంలో ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.  దొంగలముఠా నాయకుడిలా.. ఒక డాన్ లాగా.. గృహలో దాక్కొని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  ఉంటున్నారని  గద్దె రామ్మోహన్‌రావు ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-17T02:54:00+05:30 IST