ఎస్‌ఈసీతో టీడీపీ నేతల భేటీ

ABN , First Publish Date - 2021-02-06T09:54:27+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఎస్‌ఈసీతో టీడీపీ నేతల భేటీ

విజయవాడ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు శుక్రవారం ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వ యంత్రాంగం మద్దతుతో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో రద్దుకు ఏ రూలు ప్రకారం ఆదేశాలిచ్చారని వివరణ కోరితే ఎస్‌ఈసీ సరైన సమాధానం ఇవ్వలేదని వర్ల రామయ్య చెప్పారు. 

Updated Date - 2021-02-06T09:54:27+05:30 IST