విశాఖ స్టీల్ ఫ్లాంట్‌‌పై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?: అయ్యన్న

ABN , First Publish Date - 2021-02-05T22:30:59+05:30 IST

విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు

విశాఖ స్టీల్ ఫ్లాంట్‌‌పై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?: అయ్యన్న

విశాఖ: విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరం అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్టీల్ ఫ్లాంట్ చరిత్రను కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి. రైతులు త్యాగం చేసి, విలువైన భూములు స్టీల్ ఫ్లాంట్‌కు ఇచ్చారు. 64 గ్రామాల ప్రజలు నివసించే ప్రాంతాలను ఫ్యాక్టరీకి త్యాగం చేశారు. విశాఖలో 25 శాతం మంది స్టీల్ ఫ్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అన్ని పార్టీలు ఒకే మాట మీదకి వచ్చి ఫ్లాంట్‌ను కాపాడుకోవాలి. ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 18 నెలలో కాలంలో జగన్ మోహన్ రెడ్డి 20 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏం పీకారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. రైల్వే జోన్ పట్టాలపై ఆగిపోయిందా? స్టీల్ ఫ్లాంట్ కాపాడుకోవడానికి ప్రజలందరు ముందుకు రావాలి. రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సంస్థగా మార్చేశారు’ అని విమర్శించారు.

Updated Date - 2021-02-05T22:30:59+05:30 IST