ఏపీ పరువును గంగలో కలిపారు: అనురాధ

ABN , First Publish Date - 2021-11-13T22:35:19+05:30 IST

ఒక్కఛాన్స్‌తో జగన్‌రెడ్డి ఏపీ పరువును గంగలో కలిపారని టీడీపీ నాయకురాలు

ఏపీ పరువును గంగలో కలిపారు: అనురాధ

అమరావతి: ఒక్కఛాన్స్‌తో జగన్‌రెడ్డి ఏపీ పరువును గంగలో కలిపారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వైసీపీ ప్రబుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తీర్చిదిద్దిన ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్ నోటీసులివ్వడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. వైద్య పరికరాల కంపెనీలకు ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టడం సిగ్గుచేటన్నారు. రెడ్ నోటీసులపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. వైసీపీ పాలనలో వైద్యరంగం ప్రమాదంలో పడిందన్నారు. ఏపీకి వైద్యారోగ్యశాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. వైద్యంపై సీఎం జగన్ సమీక్షల వల్ల ఎవరికి ఉపయోగమని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-11-13T22:35:19+05:30 IST