దీక్షా స్థలి వద్దే పడుకునేందుకు చంద్రబాబు నిర్ణయం
ABN , First Publish Date - 2021-10-22T04:32:21+05:30 IST
ఎన్టీఆర్ భవన్ వద్ద చంద్రబాబు దీక్ష కొనసాగుతోంది. దీక్షా స్థలి వద్దే పడుకునేందుకు చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు కార్యకర్తలు తాకిడి ...
అమరావతి: ఎన్టీఆర్ భవన్ వద్ద చంద్రబాబు దీక్ష కొనసాగుతోంది. దీక్షా స్థలి వద్దే పడుకునేందుకు చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు కార్యకర్తల తాకిడి కూడా కొనసాగుతోంది. 13 జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నాయి. అయితే కార్యకర్తల తాకిడితో చంద్రబాబు పడుకునేందుకు ఏర్పాట్లు కుదరడంలేదు. కనీసం కొబ్బరినీళ్లయినా తీసుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సూచించారు. కానీ చంద్రబాబు నిరాకరించారు. దీక్షాస్థలి వద్దే కూర్చుని కార్యకర్తలు, శ్రేణులకు ఆయన అభివాదం చేస్తున్నారు.