మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-06T18:14:02+05:30 IST

అమరావతి: టీడీపీ నేతలు రాజ్ భవన్‌కి చేరుకున్నారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని

మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు

అమరావతి: టీడీపీ నేతలు రాజ్ భవన్‌కి చేరుకున్నారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని టీడీపీ నేతలు కలిశారు. ఉద్యోగస్తులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై  గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే కాబినెట్ నుంచి తొలగించాలని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు.

Updated Date - 2021-02-06T18:14:02+05:30 IST