ఓటీఎస్‌పై టీడీపీది అనవసర రాద్ధాంతం: తమ్మినేని

ABN , First Publish Date - 2021-12-21T19:32:45+05:30 IST

ఓటీఎస్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.

ఓటీఎస్‌పై టీడీపీది అనవసర రాద్ధాంతం: తమ్మినేని

శ్రీకాకుళం: ఓటీఎస్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని స్పీకర్ తమ్మినేని  సీతారం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగనన్న సంపూర్ణ ఆస్తిహక్కు పథకంపై రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఓటీఎస్‌పై ప్రజలకు వివరించడంలో క్షేత్రస్థాయి అధికారులు వైఫల్యం చెందారన్నారు. ప్రతిపక్షం తీరు ఎద్దు ఈనింది.. అంటే దొడ్డిలో కట్టేయండి అన్నట్టు ఉందని దెప్పిపోడిశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా పట్టాలు ఇస్తామని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పేదలు గుర్తుకు రాలేదా? అని తమ్మినేని సీతారం ప్రశ్నించారు.

Updated Date - 2021-12-21T19:32:45+05:30 IST