కడపలో సీబీఐని కలిసిన సునీత..

ABN , First Publish Date - 2021-09-03T09:35:23+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో కొనసాగిస్తున్నారు.

కడపలో సీబీఐని కలిసిన సునీత..

కడప క్రైం, సెప్టెంబరు 2: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో కొనసాగిస్తున్నారు. గురువారం సుంకేశుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. ఈయనను గతంలోనూ సీబీఐ అధికారులు విచారించారు. కాగా, సీబీఐ అధికారులను గురువారం వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి కలిశారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-03T09:35:23+05:30 IST